కేటీఆర్ కు తరుణ్ చుగ్ సవాల్… ఉద్యోగాలపై బీజేపీ చర్చకు సిద్ధం అంటూ..

-

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ.. బీజేపీ నిరుద్యోగ దీక్షను మొదలు పెట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో దీక్షను ప్రారంభించారు. దీనిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తరుణ్  చుగ్ ఫైరయ్యారు. తెలంగాణలో యువకులు అన్యాయానికి గురవుతున్నారని…వారికి న్యాయం జరగడానికి అండగా బీజేపీ నిలబడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ యువకుల కోసం బీజేపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి వచ్చే వరకు బీజేపీ కొట్లాడుతుందని అన్నారు.

కేసీఆర్ అందరికి ఉపాధి దొరుకుతుందంటున్నారు…కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపాధి, ఉద్యోగాలు లభించాయని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్. దోచుకోవడానికి మీ కుటుంబ సభ్యులకు లైసెన్స్ వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను లూటీ చేస్తుందని ఆయన అన్నారు. కొడుకు మంత్రి, కుతురు ఎంపీ కూడా కాబోతోందని విమర్శించారు. కేటీఆర్ బండి సంజయ్ కి రాసిన లేఖపై కూడా తరుణ్ చుగ్ స్పందించారు. కేటీఆర్ తో ఉద్యోగాలపై చర్చకు సిద్ధమని.. ఏ వేదిక నుంచైనా చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news