కెసిఆర్ పాలన దోచేయ్ – దాచేయ్ అన్నట్లుగా ఉంది – తరుణ్ చుగ్

-

కెసిఆర్ సర్కార్ తెలంగాణను లూటీ చేస్తుందని ఆరోపించారు బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. కెసిఆర్ పాలన దోచేయ్ – దాచేయ్ అన్నట్లుగా ఉందని విమర్శించారు. ధన దాహంతో ఆప్ నేతలతో కలిసి దోపిడీలో చేరేందుకు న్యూఢిల్లీలో కుంభకోణం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నేరస్తులు సత్యాగ్రహులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు మనీష్ సిసోడియా ర్యాలీలు నిర్వహిస్తారని.. కవిత వెంట పార్టీ అగ్రనేతలు వెళ్తారని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారిందన్నారు తరుణ్ చుగ్. కెసిఆర్ కు బైబై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పై ఈడీ విచారణ చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. విచారణ సంస్థలపై సీఎం కేసీఆర్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news