శ్మ‌శానంలో వైసీపీ ఎమ్మెల్యే ఎలా ?  గెలిచింది…

-

శ్మ‌శానంలో వైసీపీ ఎమ్మెల్యే గెల‌వ‌డ‌మా ?  ఇదేంటి ఈ హెడ్డింగ్ చాలా ట్విస్టింగ్‌గా ఉందే ?  శ్మ‌శానం ఏంటి ?  వైసీపీ ఎమ్మెల్యే గెల‌వ‌డం ఏంటి ? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా ? ఏపీలో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి ప‌లువురు మంత్రుల‌తో పాటు ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి లాంటి వాళ్లు టీడీపీపై ఏ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారో తెలిసిందే.

ఇక వైసీపీపై టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా ఈ రోజు కేశినేని భవన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న బుద్ధా వెంక‌న్న అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగ ప్ర‌తి ప్ర‌తి ఒక్క‌రికి ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.

ఈ క్ర‌మంలోనే రాజ‌ధానిపై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తోన్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు వెంక‌న్న ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. మంత్రి బొత్స అమరావతిని శ్మశానం అంటున్నారని… శ్మశానంలో వైసీపీ ఎమ్మెల్యే ఎలా ? గెలిచిందని ప్రశ్నించారు. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలు అయిన మంగ‌ళ‌గిరి, తాడికొండ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే వెంక‌న్న మాట్లాడుతూ ఎక్క‌డైనా కేబినెట్ సమావేశం శ్మశానంలో జరుపుతున్నారా? అని  నిలదీశారు. బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే అమరావతిని మాత్రమే కాదని… ఏపీనే శ్మశానంలా మారుస్తున్నారని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news