సీఎం జగన్‌కు టీడీపీ నేత అన‌గాని బహిరంగ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి టీడీపీ నేత అనగాని సత్య ప్రసాద్‌ బహిరంగ లేఖ రాశారు. బీసీ కార్పొరేషన్‌ నిధుల మళ్లింపుపై సీఎం జగన్‌కు లేఖ రాశారు అనగాని సత్య ప్రసాద్‌. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని లేఖలో పేర్కొన్నారు.

నిధుల మళ్లింపు పథకంతో బీసీలకు నయవంచన చేస్తోందని.. బీసీపీ ఉద్దరించేశామంటూ మోసం, దగా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ. 18.050 కోట్లు మళ్లించారని పేర్కొన్నారు. బీసీల నిధుల మళ్లింపు గురించి ఎందుకు మాట్లాడం లేదని ఆయన ప్రశ్నించారు. 2019-20 లో రూ. 15 వేల కోట్లు కేటాయించి.. రూ. 10,478 కోట్లు మళ్లించారని.. 2020-21 లో రూ. 23 వేల కోట్లు.. 2021-22 రూ. 25 వేల కోట్లు మళ్లించారని అనగాని లేఖలో ఆరోపణలు చేశారు. బీసీ కార్పొరేషన్‌ నుంచి గడిచిన రెండు సంవత్సరాలలో ఒక్క రుణమూ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు అనగాని.

Read more RELATED
Recommended to you

Latest news