వైసీపీ నేతలపై టీడీపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు…!

-

పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు వైకాపా నేతలు భూ కుంభకోణాలు రోజుకొక్కటి చొప్పున బయట పడుతున్నాయని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కోయ ప్రసాద్ రెడ్డి అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగలాలని భయటపెట్టేందుకు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేసారు. ఈ విచారణకు ఆదేశించకపోతే పెద్ద భూ కుంభకోణాల నుంచి ప్రజలను మభ్య పెట్టేందుకే తూతు మంత్రంగా ఒకరిపై చర్యలు తీసుకున్నారని భావించాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరుడు కొయ్య ప్రసాద్ రెడ్డి వైజాగ్ లో 100 ఎకరాలు కబ్జాకు ప్రయత్నం చేశాడని ఆమె ఆరోపించారు. జగన్, విజయసాయిరెడ్డిల ప్రోద్బలంతోనే అనేక మంది వైకాపా నాయకులు వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని విమర్శలు చేసారు. వైకాపా నాయకుల వైఖరికి వైజాగ్ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news