పిఠాపురంలో మరో పంచాయతీ.. రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు వర్మ

-

పిఠాపురంలో మరో పంచాయతీ..దింతో టీడీపీ నాయకుడు వర్మ.. రెచ్చిపోయారు. పిఠాపురంలో అక్రమ ఇసుక తవ్వకాలపై టీడీపీ నాయకుడు వర్మ మండిపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

TDP leader Verma furious over illegal sand mining in Pithapuram
PITAPURAM VARMA

కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. పోలీసులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున వారితో కుమ్మక్కయ్యారని ఆగ్రహించారు. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే పోలీసులు నాలుగు రోజులు స్టేషన్ లో ఉంచుతున్నారన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రజలే రోడ్ల మీదికి వచ్చి ఆందోళన చేస్తారన్నారు పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news