రేపు గుడివాడలో జరగనున్న టిడిపి మహానాడు వాయిదా!

-

గుడివాడలో రేపు జరగనున్న టీడీపీ మహానాడు వాయిదా పడింది. ఎడతెరిపిలేని వర్షం, వాతావరణం అనుకూలంగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. గుడివాడలో రేపటి మహానాడు నిర్వహణపై మంగళవారం చంద్రబాబుతో ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు. గుడివాడ మహానాడు నిర్వహించిన తర్వాతే మరో కార్యక్రమం చేపడదామని ఈ సందర్భంగా అధినేత తెలిపారని సమాచారం.

కాగా గుడివాడలో నిర్వహించే మినీ మహానాడులో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.అయితే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news