హర్ ఘర్ తిరంగా అద్భుత కార్యక్రమం : చంద్రబాబు

-

ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా భారతదేశంలో యువత ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే మన దేశాన్ని యంగ్ ఇండియా అంటారని గుర్తుచేశారు. ఈ యువశక్తిని మొత్తంగా వినియోగిస్తే ప్రపంచంలోనే ఇండియా నంబర్ వన్ గా నిలుస్తుందని తెలిపారు.

హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో నిర్వహించిన అజాదీ కా అమృత్​ మహోత్సవాలల్లో చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. 75 ఏళ్ల స్వతంత్రాన్ని  పూర్తి చేసుకున్న వేళ సంబురాల్లో భాగంగా నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగా అద్భుతమైన కార్యక్రమం అని బాబు కొనియాడారు. రాబోయే మూడు రోజులు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news