తెలంగాణా కరోనా : 661 కేసులు, 3 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే నిన్న దీపావళి కావడంతో టెస్ట్ లు బాగా తగ్గించారు. సో కేసులు కూడా తగ్గ్గాయి.తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 661 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,374 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు 1404 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 15,425గా ఉన్నాయి.

వారిలో 12,899 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,40,545 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,637 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 93.46% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.1% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0..54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 21264 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 48,74,433 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 167 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news