Telangana : రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక పద్దుకు ఆమోదం కోసం.. శాసనసభ, శాసనమండలి రేపటి నుంచి సమావేశం అవుతున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు.

రేపటి కోసం బడ్జెట్‌ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు పంపింది. దానికి గవర్నర్ ఇంకా ఆమోదముద్ర వేయలేదన్న ప్రచారం ఉంది. అటు సమావేశం నిర్వహణ కోసం సన్నాహకాలు పూర్తి చేశారు. సీఎస్, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్​రెడ్డి సమావేశమయ్యారు.

సమావేశాల నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వపరంగా వివిధ శాఖల నుంచి ఇవ్వాల్సిన సమాధానాలు, సమావేశాల సన్నద్ధతపై అధికారులతో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news