Breaking news: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీష్ రావు 2022-23 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో హరీష్ రావు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ నినాదాలు చేశారు. దీంతో మంత్రి తలసాని ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తీర్మాణానికి మిగతా సభ్యులు మద్దతు ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని ఈ అసెంబ్లీ సమావేశాల ముగింపు వరకు సస్పెండ్ చేశారు. telangana-assembly

హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. హాజరైన కొద్ది సేపటికే సభ నుంచి సస్పెండ్ అయ్యారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీ ఎమ్మెల్యేలు.. సమస్యలను ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. సభ ప్రారంభం అయిన అరగంటలోపే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Latest news