మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటి.. లాక్ డౌన్ పై కీలక ప్రకటన!

-

మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో కరోనా , లాక్ డౌన్, వర్షపాతం, ఖరీఫ్ సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్  చర్చించనున్నది. అయితే తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ఎత్తివేస్తుందా ? లేక అలాగే కొనసాగిస్తుందా ? అనే విషయంపై ఇవాళ్టి కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయడానికే కెసిఆర్ సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా.. ఇవాళ్టితో తెలంగాణలో లాక్ డౌన్ గడువు ముగుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news