థియేటర్స్, మాల్స్ పై తెలంగాణాలో ఆంక్షలు !

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, కొత్త వేరియంట్  ఓమి క్రాన్   వైరస్ ల పై తెలంగాణ క్యాబినెట్ సమీక్ష నిర్వహించనుంది.

అలాగే విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారి పై ఆంక్షలు విధించాలని.. ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ కు తరలించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.  కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం తో పాటు… పబ్స్ , సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ ల పై… కూడా నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది.  అలాగే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఈ అంశంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news