ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ… ఆ దేశాల విమానాలు రద్దు చేయండి.

-

ఓమిక్రాన్ ఇప్పుడు ఈ ఒక్క పేరు ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి వెలుతున్నాయి. తాజాగా ప్రపంచ దేశాలు.. ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఆయా దేశాల నుంచి వచ్చే వారిపై కరోనా ఆంక్షలు విధిస్తున్నారు.

విమానం

ప్రస్తుతం ఇండియా కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ పై అలెర్ట్ అయింది. పలు రాష్ట్రాలు కూడా ఆంక్షలు కూడా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొత్త వేరియంట్ ఎక్కువగా ఉన్న దేశాల విమానాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆలస్యం అయితే మళ్లీ ప్రజలంతా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు.. యూరోపియన్ యూనియన్ దేశాలు ఓమిక్రాన్ ప్రభావిత దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news