తెలంగాణా కరోనా …1,967 కేసులు, 8 మరణాలు !

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 99,391కి చేరింది. అలానే నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 737కి పెరిగింది.

corona-positive
corona-positive

ఇక నిన్న కరోనా బారి నుంచి నిన్న 1,781 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 76,967కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 21,687గా ఉండగా అందులో 15,332 మంది హోం ఐసోలేషన్ లోనే ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక నిన్న తెలంగాణలో 26,767 టెస్ట్ లు చేయగా ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ ల సంఖ్య 8,48,078కి చేరింది. ఇక ఇక్కడ సంతోషం కలిగించే అంశం ఏమిటంటే రికవరీ రేట్ 77.43 గా ఉంది. అలానే డెత్ రేట్ కూడా 0.74% గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news