తెలంగాణపై కరోనా పంజా.. ఒక్క రోజులోనే..!

-

తెలంగాణలో కరోనా విజృంభణ తార స్థాయికి చేరుకుంది. రోజుకి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వేగం చూస్తుంటే దీనిని ఇప్పట్లో అరికట్టడం కష్టమే అనిపిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా దీనిని అదుపు చేయలేకపోతున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 237 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 195 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఒక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పటివరకు 4,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,412 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో ముగ్గురు చనిపోవడంతో, రాష్ట్రంలో మరణాల సంఖ్య 185కి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news