తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 2 కరోనా కేసులు వలసకార్మికులకు చెందినవి ఉన్నాయి. అయితే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇవాళ 108 మందికి కరోనా సోకింది. అలాగే రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 6 చొప్పున.. మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో రెండేసి కరోనా కేసులు నమోదయ్యాయి. యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒకటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. అలాగే ఇవాళ ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3020కు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 99 మంది మరణించగా 1,556 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,365 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా విజృంభణ…3 వేలు దాటిన కేసులు..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఎన్నికల వేళ వైసీపీ నేతలకు సీఎం జగన్ మార్గదర్శకాలు ఇవే
సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఓవైపు వైఎస్సార్సీపీ, మరోవైపు టీడీపీ,...
చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాష్ట్రంలో పలుచోట్ల...
BREAKING : గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు...