తెలంగాణా కరోనా : 502 కేసులు, 3 మరణాలు

-

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. అయితే అది వైరస్ ప్రభావం తగ్గినందువలన అనుకునేరు. కాదు అండోయ్, మొన్న దీపావళి కావడంతో టెస్టులు తక్కువగా చేశారు.  ఇక నిన్న ఆదివారం కావడంతో కూడా ఈ టెస్ట్ లు తగ్గాయి. దీంతో కరోనా కేసులు కూడా బాగా తగ్గాయి.  తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 502 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,57,876 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు 1407 మంది కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు  14,385గా ఉన్నాయి. వారిలో 11,948 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,42,084 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 93.87% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.2% శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0..54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 17296 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 48,91,729 పరీక్షలు చేశారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 232 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news