తెలంగాణలో మళ్ళీ తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే ?

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు మళ్ళీ భారీగానే పెరుగుతున్నాయి. ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. అయితే నిన్న కరోనా కేసుల నమోదు భారీగా తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,718 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,97,327 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 8 మంది మరణించారు. ఇప్పటి వరకు 1153 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 28,328గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,67,846 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,002 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 85.05% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 83.8% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 49,084 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 31,53,626 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 285 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news