విచారణకు హాజరు కావాల్సిందే.. సునీల్ కనుగోలుకు హైకోర్టు ఆదేశం

-

పోలీసుల విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో  ఈనెల 8న విచారణకు రావాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సునీల్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంంలో.. సీఆర్పీసీ 41ఏ నోటీసులు రద్దుచేయాలని సునీల్‌ హైకోర్టును అభ్యర్థించారు. సునీల్‌ కనుగోలు అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సునీల్‌ కనుగోలును అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news