BREAKING : మే 6 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలెర్ట్‌. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి ప్రారంభించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లోమార్పు చేసి.. ఏప్రిల్‌ నుంచి మే 4 వ తేదీ నుంచి నిర్వహించనుండటంతో.. ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసింది తెలంగాణ విద్యాశాఖ. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి మే 23 వరకు జరుగనున్నాయి.

ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది. ఇక ఇంటర్‌ పరీక్షల కారణంగా.. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడే ఛాన్స్‌ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మే 11 వ తేదీ నుంచే పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు ఇంటర్‌, పదో తరగతి పరీక్షలను ఒకే సారి జరుగుతాయి. కాబట్టి ఇంటర్‌ పరీక్షలు అయిపోయిన తర్వాత.. పదో తరగతి పరీక్షలు జరిగే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news