మే 5 వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు !

-

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్‌. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 5 వ తేదీ నుంచి ప్రారంభించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లోమార్పు చేసి.. ఏప్రిల్‌ నుంచి మే 4 వ తేదీ నుంచి నిర్వహించనుండటంతో.. ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు కచ్చితంగా ఉండనుంది.

ఇక దీనిపై ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్ ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులతో.. కూడా చర్చించినట్లు సమాచారం అందుతోంది. ఇవాళో,.. రేపో ఈ ఇంటర్ పరీక్షల కొత్త తేదీలను విడుదల చేయనుంది విద్యా శాఖ. ఇంటర్‌ రెండు సంవత్సరాల పరీక్షలు మొత్తం 16 రోజులు జరుగనున్నాయి.

జేఈఈ మెయిన్‌ కు ఎంపీసీ సెకండీయర్‌ సంవత్సరం విద్యార్థులు మాత్రమే హాజరు కానున్నారు. అలాగే.. మే 4న జేఈఈ మెయిన్‌ రాసిన వారు మారునాడే ఇంటర్‌ పరీక్ష రాయాలన్నదే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఏ విజ్ఙప్తి చేస్తే.. తేదీల్లో వెసులుబాటు లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news