తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో గతేడాది పరిణామాలు పునరావృతం కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, ఎక్కడా పొరబాటు జరగకుండా ఒకటికి రెండు టెక్నాలజీలు ఉపయోగించామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో కొమురంభీం జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. మేడ్చెల్ రెండోస్థానంలో నిలిచింది అని తెలియజేశారు.. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, bie.telangana.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..!
-
Previous article
Read more RELATEDRecommended to you
పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా చెట్టుకు చెదలు లాంటి వాళ్లే : జగదీష్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వణుకు...
Ganesh -
కేజ్రీవాల్ కేసు.. ఈడీపై సుప్రీం కోర్టు అసహనం
లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని ఈడీ...
Ganesh -
ఎయిడ్స్ కంటే పెద్దిరెడ్డి చాలా ప్రమాదకరం.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నేతలు ఒకరిపై...
Anji N -