తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..!

-

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో గతేడాది పరిణామాలు పునరావృతం కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, ఎక్కడా పొరబాటు జరగకుండా ఒకటికి రెండు టెక్నాలజీలు ఉపయోగించామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో కొమురంభీం జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. మేడ్చెల్ రెండోస్థానంలో నిలిచింది అని తెలియజేశారు.. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, bie.telangana.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news