చిరంజీవి, ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి

-

కేసీఆర్‌ కేబినేట్ మంత్రుల్లో… పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఒకరు. పువ్వాడ అజయ్‌ ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా…ఖమ్మం జిల్లా నుంచి ఏకైక మంత్రిగా కొనసాగుతున్నారు. అందరూ మంత్రుల కంటే… అజయ్‌ చాలా భిన్నమైన నాయకులు. కమ్యూనిస్టు భావ జాలం ఉన్న పువ్వాడ ఎప్పుడు వార్తల్లో ఉంటారు.

అయితే.. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌లను కలిశారు. తన కుమారుడు నయన్‌ రాజు పుట్టిన రోజు సందర్భంగా తనయుడితో కలిసి ఆయన చిరంజీవి, ఎన్టీఆర్‌ లను మర్యాద పూర్వకంగా కలిశారు.

చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ లకు నయన్‌ పెద్ద అభిమాని. అందుకే కొడుకు పుట్టిన రోజు సందర్భంగా అతడిని వారి వద్దకు మంత్రి పువ్వాడ అజయ్‌ తీసుకెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా నయన్‌ రాజుకు చిరంజీవి, ఎన్టీఆర్‌ పుట్టిన రోజు విషేష్‌ తెలియజేసి… కేక్‌ కట్‌ చేయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా అవుతున్నాయి. నయన్‌ ను హీరోగా పరిచయం చేసేందుకే… పువ్వాడ వారిని కలిశారా ? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news