మల్లా రెడ్డిపై ఐటీ సోదాలు..తెలంగాణ మంత్రులు అత్యవసర భేటీ

-

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కి ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేస్తోంది. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో అలాగే, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.

అయితే… మల్లా రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. మంత్రి మల్లా రెడ్డిపై ఐటీ సోదాల నేపథ్యంలో నేతల భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news