బిగ్ బ్రేకింగ్: శభాష్ తెలంగాణా పోలీస్… గంటల వ్యవధిలో సెన్సేషన్ చేసారుగా…!

-

దేశ రాజధాని ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా ముస్లింలు మత ప్రార్థనలలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు వారందరూ తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని లక్షణాలు బయటపడుతున్నాయి.

దీనితో ఎక్కడ విస్తరిస్తున్న అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఆందోళనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే కేసులు 17 బయటపడ్డాయి. ఈ కేసులు అన్నీ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే. ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని వివరాలను సేకరించారు అధికారులు. ఇప్పుడు వారందరినీ పట్టుకునే పనిలో పడ్డారు. నిజామాబాద్ ,ఖమ్మం ,కరీంనగర్ ,హైదరాబాద్ నుంచి ముస్లిములు ప్రార్థన లో పాల్గొనడానికి వెళ్లారు.. తాజాగా తెలంగాణ పోలీసులు ఈ విషయంలో కీలక అడుగు వేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో 32 మందిని పోలీసులు గుర్తించారు.

వారందరినీ జగిత్యాల క్వారంటైన్ సెంటర్ కి తరలిస్తున్నారు అధికారులు. ఎక్కడా కూడా గ్రామాలకు టచ్ కాకుండా జాతీయ రహదారి వెంబడి తీసుకుని వెళ్లడం తో ఇప్పుడు ప్రజలు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే వారు ఎవరితో అయినా కలిసారా…? లేకపోతే వాళ్ళు ఎక్కడైనా తిరిగారా…? అనే దాని మీద కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు వారిలో ఎవరికైనా లక్షణాలు బయట పడితే మాత్రం ఇబ్బందే. అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఏది ఎలా ఉన్నా వారిని గంటల వ్యవధిలో తెలంగాణ పోలీసులు గుర్తించటం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news