మాజీ ఎమ్మెల్యే చింతమనేని కోసం తెలంగాణ పోలీసుల గాలింపు..!

-

పటాన్చెరువు మండలం చిన్న కంజర్ల శివారులో సర్వేనెంబర్ 250 లో మామిడి తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయం తెలియడంతో పటాన్చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.

ఈ ఘటన స్థలంలో ఏకంగా 70 మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీష్, కృష్ణంరాజు అలాగే శ్రీను తదితరులు అక్కడ కోడిపందాలు ఆడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందులో 21 మందిని పోలీసులు పట్టుకున్నారు.

అలాగే 13 లక్షలు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కోడి కత్తులు అలాగే 31 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. చింతమనేని ప్రభాకర్ కృష్ణంరాజులు పరారయ్యారని… అక్కినేని సతీష్ అలాగే బర్ల శ్రీను పోలీసులు అడుగులో ఉన్నారని డిఎస్పి వెల్లడించారు.
ఈ కేసు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news