స్టార్ హీరోలు విశాల్, కార్తీలను చంపేస్తామంటూ బెదిరింపులు.. కేసు నమోదు

-

కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు విశాల్, కార్తీలను చంపేస్తామంటూ ఆర్టిస్ట్ రాజా దురై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీస్ స్టేషన్లో నడిగర్ సంఘానికి చెందిన అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలను ఓ ఆర్టిస్టు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు, నిర్మాత అయిన విశాల్ ఆయన స్నేహితుల్లో ఒకరైన హీరో కార్తి ప్రస్తుతం నడిగర్ సంఘంలో కీలకంగా ఉన్నారు.

నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ కొనసాగుతుండగా కార్యదర్శిగా విశాల్.. మరో కీలక పదవిలో కార్తీ కొనసాగుతున్నారు. అయితే వీరిపై రాజాదురై అనే ఆర్టిస్ట్ ద్వేషం పెంచుకుని వారిద్దరినీ చంపేస్తానని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని నడిగర్ సంఘంలోని ఆఫీసర్ ధర్మరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తేనం పోలీసులు విచారణ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news