థియేటర్ల ఓపెనింగ్ 15 నుండే.. ప్రభుత్వం కాపాడాలి : థియేటర్ ఓనర్స్ అసోసియేషన్

-

థియేటర్ల పున ప్రారంభం పై సుదర్శన్ థియేటర్ లో తెలంగాణా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ తరపున థియేటర్ ఓనర్స్ అంతా సమావేశమయ్యారు. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి, సుదర్శన్ థియేటర్ పార్టనర్ బాల గోవింద్ రాజు వంటి వారు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 15నుంచి కేంద్రం అనుమతి ఇచ్చిందని, తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని అనుకుంటున్నామని అన్నారు.

మా ఓనర్స్ అసోసియేషన్ అందరం థియేటర్స్ తెరవాలని నిర్ణయించామన్న ఆయన తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలి. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని నమ్మకం ఉందని అన్నారు. ఇక పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతించాలన్న అన్న ఆయన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కూడా సినిమా హాళ్లు ఓపెన్ చేస్తామన్నారని అన్నారు. ఇక బాల గోవింద్ రాజు మాట్లాడుతూ మమ్మల్ని కాపాడగలిగేది స్టేట్ గవర్నమెంట్ ఒక్కటేనన్న ఆయన మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని, పార్కింగ్ విషయంలో , కరెంట్ విషయంలో ప్రభుత్వం మాకు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news