రామంతపూర్ SBI లో 2.8 కోట్లు కాజేసిన మేనేజర్.. భార్య, కొడుకు అకౌంట్లకి ట్రాన్స్ ఫర్..!

-

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు, రికార్డులు సరిచేయాల్సిన రెవెన్యూ అధికారులు తరచూ మోసాలకు పాల్పడటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఇదే తరహాలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా మేనేజరే బ్యాంకులో డబ్బులు కాజేశాడు. ఈ ఘటన నగరంలోని రామంతాపూర్ ఎస్బీఐ (SBI) బ్యాంకులో చోటుచేసుకుంది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.8 కోట్లు కాజేశాడు. ఖాతాదారులు డాక్యుమెంట్లతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

మేనేజర్ భార్య, కొడుకు ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మొత్తం 19 మంది డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకొని వారి పేర లోన్లు తీసుకున్నాడు. మోసం జరిగిందని గుర్తించిన ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో మేనేజర్లు సైదులు, గంగమల్లయ్యపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news