హైదరాబాద్ లో దారుణం..ఓ వ్యక్తిని పెట్రోల్‌ పోసి తగలబెట్టిన గ్యాంగ్‌ !

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టింది జియగుడాకు చెందిన గోపి గ్యాంగ్‌. పాత క్షకల కారణంగా దారుణ హత్యకు పాల్పడింది గోపి గ్యాంగ్‌.

A gang who poured petrol on a person and set him on fire

హత్య చేసి బెడ్ షీట్ లో చుట్టి డస్ట్ బిన్ వద్ద మృతదేహాన్ని తగలబెట్టారు. నిన్న రాత్రి అనిల్ ను హత్య చేసిన గోపి…ఈ రోజు తెల్లవారు జామున జియగుడా సోన టిఫిన్ సెంటర్ ఎదురు వీధిలో డస్ట్ బిన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు తగలబెట్టాడు. కొంత మంది స్నేహితుల సహయంతో గోపి..ఈ పని చేశారని సమాచారం.

ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు గోపి ఉన్నాడు. అనిల్ హత్య చేసిన అనంతరం జీయగుడాలో నిన్న అర్థరాత్రి నరికిన చేతితో గోపి తిరిగాడని గుర్తించారు పోలీసులు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న కులుసుంపుర పోలీసులు క్లూస్ టీమ్..దర్యాప్తు చేస్తున్నాయి. అటు అనిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news