BREAKING : అమిత్ షాతో సమావేశం..ఈటల రాజేందర్ కు కీలక పదవి !

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్…. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై కీలక చర్చలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు.. ఏనుగు రవీందర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గత ఏడాది క్రితమే.. ఈటల రాజేందర్ తో పాటు.. ఏనుగు రవీందర్‌ కూడా బీజేపీ పార్టీ లో చేరారు. అంతేకాదు… ఈ సందర్భంగా ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్‌ కు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొని రావడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు అమిత్ షా. అలాగే.. బీజేపీ పార్టీ ఈటల రాజేందర్‌ కు కీలక పదవి కూడా ఇచ్చేందుకు అధిష్టానం సన్నద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. కాగా.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీపై 20 వేలకు పైగా మెజారిటీ తో ఈటల విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news