శంషాబాద్ లో దారుణం…ఓ యువతిని హత్య చేసి..మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టిన పూజారి

-

శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అప్సరా అనే అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు పూజారి సాయి కృష్ణ. హత్య తరువాత మృతదేహాన్ని సరూర్ నగర్ వద్దకు తీసుకొని మురికి కాలువలో పడేసి మట్టితో పూడ్చిపెట్టాడు పూజారి సాయి. హత్య చేసిన కేటుగాడు…ఆ తర్వాత ఆప్సరా మిస్సింగ్ అయిందంటూ ఎయిర్ పోర్ట్ పోలీస్‌ స్టేషన్ లో ఈ నెల 3న ఫిర్యాదు చేశాడు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనంతరం. అఫ్సరా ను శంషాబాద్ సుల్తాన్ పల్లి లోని ఓ ఫాం హౌస్ కు తీసుకొని వచ్చిన పూజారి… పోలీసులనే తప్పుదోవ పట్టించాడు. యువతి తనను పెండ్లి చేసుకోమని ఒత్తడి చేసిందని…. ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పాడు సాయి. ఈ తరుణంలోనే ఒక్కసారిగా రాయి తో తల పై బాదాడు పూజారి. దీంతో స్పాట్ లోనే మృతి చెందిన అప్సరా…అనంతరం మృతదేహాన్ని కారు లో సరూర్‌నగర్‌ కు తరలించాడు పుజారి సాయి. హత్య తరువాత మృతదేహాన్ని సరూర్ నగర్ వద్దకు తీసుకొని మురికి కాలువలో పడేసి మట్టితో పూడ్చిపెట్టాడు పూజారి సాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news