కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం..కేరళ నుంచి పిలుపు

-

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం దక్కింది.కేరళ నుంచి ఓ కార్యక్రమానికి రావాలని పిలుపు వచ్చింది.  వచ్చే ఏడాది జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు.

కేరళలోని కన్నూరులో రెండు రోజులపాటు జరిగే సమావేశాలకు రావాలని ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పంపారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మూడున సాంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. సమావేశాలను కేరళ సీఎం విజయన్ ప్రారంభించనుండగా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news