మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. వృద్ధురాలు దారుణ హత్య..!

-

వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన మెదక్ జిల్లా పరిధిలోని చిన్న కోడూరు మండలం గంగాపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అంతగిరి సత్యవ్వ (70) మంగళవారం అర్థ రాత్రి కాలుజారి కింద పడిపోయిందని కొడుకు చంద్రశేఖర్ సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే సత్తవ్వ అప్పటికే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.

బుధవారం సమాచారం తెలుసుకున్న పోలీసులు కొడుకును విచారించి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఏసీపీ మధు, సీఐ శీను, ఎస్సై బాలకృష్ణ చేరుకుని పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. వృద్ధురాలు సత్యవ్వది హత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది త్వరలోనే విచారణ చేపట్టి వెల్లడిస్తామని  తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news