శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కు రోడ్డు ప్రమాదం

-

 

 

బీజేపీ పార్టీ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ చౌరస్తా లో స్వామి గౌడ్ మోటర్ సైకిల్ అదుపు తప్పింది. ఈ నేథ్యంలోనే ఆయన రోడ్డు పై పడిపోయారు. అయితే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ రోడ్డుపై పడడంతో ఎడమ‌ కాలు విరిగింది.

దీంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే స్వామి గౌడ్ కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు… తెలిపారు. బండ్లగూడ చౌరస్తా నుండి మోటర్ సైకిల్ పై కిస్మత్ పూర్ లోని తన ఇంటికి వెళ్తుండగా ప్రమాదం….జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా రోడ్లు దెబ్బ తిన్నాయి. రోడ్డు పై ఉన్న గుంత లో పడ్డ స్వామి గౌడ్ మోటర్ సైకిల్… కంట్రోల్ కాకపోవడం తో కింద పడ్డారు స్వామి గౌడ్. ఆ తర్వాత స్వామి గౌడ్ కాళ్లపై మోటర్ సైకిల్… పడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news