BREAKING : నేడు తెలంగాణకు అమిత్ షా…చేవెళ్ల బహిరంగ సభలో ప్రసంగం

-

BREAKING : నేడు తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల బహిరంగ సభలో ప్రసంగించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇవాళ చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొన నున్న అమిత్ షా…RRR టీంతో జరగాల్సిన భేటీని రద్దు చేసుకున్నారు.

దీంతో ఇవాళ నేరుగా బహిరంగ సభకు వెళ్లనున్నారు అమిత్ షా. ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉండడంతో ఆలస్యంగా హైదరాబాద్ కు అమిత్ షా రానున్నారు. ఈ కారణంగా బీజేపీ నేతలతో మీటింగ్ కూడా రద్దు చేసుకున్నారు అమిత్‌ షా.  కాగా, తెలంగాణలో పూర్తి మెజారిటీతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిన్న ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదిక గా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. దక్షిణ భారతానికి ముఖద్వారంగా భావించే కర్నాటక ఎన్నికలు మాకు చాలా ముఖ్యం అని వివరించారు అమిత్‌ షా.

Read more RELATED
Recommended to you

Latest news