కేటీఆర్ కొడుకు “హిమాన్షు”పై తీన్మార్ మల్లన్న మరో పోస్ట్..!

-

బీజేపీ పార్టీ నేత,ప్రముఖ జర్నలిస్టు తీన్మార్‌ మల్లన్న… టీఆర్‌ఎస్‌ పార్టీపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్యూ న్యూస్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా.. పొద్దున్నే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ను తిట్టడం మొదలెడతారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను.. ప్రజలకు ఎత్తి చూపిస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే.. తాజాగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కుమార్‌.. తన సోషల్‌ మీడియాలో మరో పోస్టు పెట్టాడు.

మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఫ్లెక్సీని యాదగిరిగుట్టలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫోటో ను టార్గెట్ చేస్తూ…”తస్మాత్ జాగ్రత్త ప్రజలారా దొంగలున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు” అంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక దీనిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.ఇది ఇలా ఉండగా.. గతంలో.. కూడా కేటీఆర్‌ కొడుకు హిమాన్షుపై మల్లన్న పోల్‌ నిర్వహించారు. దీంతో ఈ పోల్‌ వివాదం మారింది. ఆ తర్వాత.. తీన్మార్‌ మల్లన్నపై టీఆర్ఎస్‌ పార్టీ అభిమానులు దాడి కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news