BREAKING : ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసులో మరో ట్విస్ట్‌..

-

ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇవాళ ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్‌ చేసారు అధికారులు. అయితే, 17 ఏ, 17 సి డాక్యుమెంట్లు భద్రపరిచిన ట్రంక్ పెట్టెలలో 4 పెట్టెలకు మాత్రమే తాళాలు ఉన్నాయి.. ఆ నాలుగింటి తాళాలు కూడా మాయం.. మిగతా వాటికి తాళమే లేవు.

డాక్యుమెంట్లు భద్రపరచిన ట్రంక్ పెట్టె తాళాలు లేవని చెబుతున్నారు పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 4 బాక్సులకు సంబంధించిన తాళాలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అటు ట్రంక్ పెట్టెల తాళాలు పగులకొట్టారు అధికారులు. ట్రంక్ పెట్టేలా తాళాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్. న్యాయమే గెలుస్తుందనే నమ్మకం ఉందని.. అన్ని డాక్యుమెంట్స్ సీరియల్ ప్రకారం సెట్ చేసేందుకు మరో నాలుగు గంటలు పడుతుందని వివరించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news