కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం జగన్‌

-

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి కేసీఆర్ ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడడంతో కాలు విరిగిన విషయాన్ని తెలుసుకున్న జగన్‌ శుక్రవారం కేటీఆర్‌ కు ఫోన్ చేశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.

సోమాజిగూడలోని యశోద దవాఖానలో చేరిన కేసీఆర్ ను పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news