అసెంబ్లీలో ఎమ్మెల్యేలు హరీశ్ రావు-రాజ్ గోపాల్ రెడ్డి మధ్య వాదోపవాదనలు..!

-

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. శాస‌న‌స‌భ‌లో రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా ప‌ని చేసిన హ‌రీశ్‌ను కేసీఆర్ సీఎం చేయ‌రు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై హ‌రీశ్‌రావు భ‌గ్గుమ‌న్నారు.

మీ పార్టీ లాగా రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష ప‌ద‌వి కొనుక్కునే ఖ‌ర్మ‌ మాకు లేదు. రాజ‌గోపాల్ రెడ్డి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడారు. ఆయ‌న విత్ డ్రా చేసుకుంటే మేం రెడీ. పీసీసీ ప‌ద‌విని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నార‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్సే మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. రాజ‌గోపాల్ రెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటే నేను ఉప‌సంహ‌రించుకునేందుకు రెడీగా ఉన్నాను. నేను కామెంట్ చేయ‌లేదు స‌భా నాయ‌కుడిపై. వారి వైపు నుంచి ఇష్టారీతిగా కామెంట్ చేసిన‌ప్పుడు.. నేను వారు బ‌య‌ట చేసిన మాట‌ల‌ను గుర్తు చేశాను. ఇదేదో నేను సొంత వ్యాఖ్య‌లు చేయ‌లేదు. మా పార్టీ మీద చేసిన కామెంట్స్‌ను విత్ డ్రా చేసుకుంటే నేను రెడీ. స‌భా స‌జావుగా న‌డ‌వాల‌న్న‌దే నా అభిప్రాయం. కొత్త ఆరోప‌ణ‌లు చేయ‌లేదు అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news