రేవంత్‌ గ్రామంలో మహిళా జర్నిలిస్టులపై దాడి..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు !

-

రేవంత్‌ గ్రామంలో మహిళా జర్నిలిస్టులపై దాడి జరిగిన సంఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణం అన్నారు కేటీఆర్‌. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులుపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణం అంటూ ఆగ్రహించారు కేటీఆర్‌.

Attack on women journalists in Revanth village KTR sensational comments

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కోరారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news