ఓయూ విద్యార్థి నరేష్ ని పరిగెత్తించి కొట్టిన అయ్యప్ప స్వాములు

-

రెండు రోజుల క్రితం కొడంగల్ లో ఓ సభలో పాల్గొన్న ఓయూ విద్యార్థి బైరి నరేష్ హిందూ దేవుళ్ళు, అయ్యప్ప స్వామి నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప స్వామి పుట్టుకపై అనుచితంగా మాట్లాడాడు బైరి నరేష్. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో హిందూ సమాజం భగ్గుమంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగించారు. కోస్గి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అక్కడికి వచ్చాడు బైరి నరేష్. దీంతో అతడిని చూసిన అయ్యప్ప స్వాములు తీవ్ర అగ్రహానికి గురయ్యారు. నరేష్ ని రోడ్డుపై పరిగెత్తించుకుంటూ కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అయ్యప్ప స్వాములను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.

అనంతరం అక్కడి నుండి బైరి నరేష్ కారులో పరారయ్యారు. హిందూ దేవతలను అశ్లీల, అసభ్య పదజాలాలతో వర్ణించడంతో యావత్ హిందూ జాతి చాలా అవమానం, బాధకు గురవుతుందని నిరసనకారుల్లో పలువురు విమర్శిస్తున్నారు. ఇక బైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మత విద్వేషనలు సహించేది లేదని స్పష్టం చేశారు ఎస్పీ.

Read more RELATED
Recommended to you

Latest news