తెలంగాణలో విషాదం…కుర్చీ మీద పడి శిశువు మృతి

-

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. కుర్చీ మీద పడి శిశువు మృతి చెందింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేటలో ఊయల కోసం కట్టిన ఇనుప స్టూల్ మీదపడటంతో ఆరు నెలల శిశువు మృతి చెందింది. ఛత్తీస్ గడక్కు చెందిన లోక్ నాథ్ ఖుర్ష్ దంపతులు కొంతకాలంగా కాజీపేట సోమిడిలో ఉంటూనగరంలో కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారు.

Baby died after falling on a chair

బుధవారం లోక్ నాథ్ ఖుర్ష్ భార్య ఆరు నెలల రోషితను ఇనుప స్టూల్ కు, ఓ దర్వాజకు చీరతో ఊయల కట్టాడు. అకస్మాత్తుగా స్టూల్ బ్యాలెన్స్ తప్పి రోషితపై పడింది. ఈ ఘటనలో రోషిత తలకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం చిన్నారి మృతి చెందింది. తండ్రి లోక్నాధ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news