కేటీఆర్ వ్యవహారం రాష్ట్రంలో రాహుల్ గాంధీ లోటు భర్తీ చేస్తుంది : బండి సంజయ్

-

మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత నుండి రోజు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. వరదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అంటూ కామెంట్స్ చేసిన కేటీఆర్ అనంతరం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును తెర పైకి తెచ్చారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ కు కరీంనగర్ ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది గత మీ ప్రభుత్వమే అని గుర్తు చేసారు.

అలాగే 2015 నుంచి కేసును పూర్తి చేయడం లో BRS ప్రభుత్వం విఫలమైంది. ట్విట్టర్ లో స్టార్ డం కోసం ఇప్పుడు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారు. మీరు నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే ఓటుకు నోటు కేసును సీబీఐకి లేదా ఈడికి బదిలీ చేసి ఉండాల్సింది. కేటీఆర్ వ్యవహారం రాష్ట్రంలో రాహుల్ గాంధీ లేని లోటు భర్తీ చేస్తున్నట్లు ఉంది అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news