సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు – బండి సంజయ్‌

-

సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్‌. నిన్న రేవంత్‌ రెడ్డి కంటతడి పెట్టిన ఇష్యూపై బండి సంజయ్‌ స్పందించారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని తెలిసి పీసీసీ పదవి నుండి తప్పిస్తారనే బాధతోనే కన్నీళ్లు పెట్టుకున్నారేమో అంటూ చురకలు అంటించారు. ఈటల రాజేందర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మేమంతా అదే మాట చెప్పాం కదా అని నిలదీశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలే ఈ విషయంపై బహిరంగంగా చర్చించుకున్నారు కదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుకు యత్నిస్తోందని మల్లిఖార్జున్ ఖర్గే కూడా చెబుతున్నారు కదా? కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులిచ్చింది నిజం కాదా? అని నిలదీ శారు. నీచులైన అతీక్ అహ్మద్ కొడుకును ఎన్ కౌంటర్ చేస్తే, అతీక్ అహ్మద్ ను చస్తే సంతాపం తెలపడమా? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఓట్ల కోసం బీఆర్ఎస్, ఎంఐఎం మత రాజకీయలు చేయడం సిగ్గు చేటు అని.. తెలంగాణ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నానని తెలిపారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news