పవన్ కళ్యాణ్ vs ప్రభాస్ ఫ్యాన్స్ వార్… నిండు ప్రాణం బలి…

-

హీరోలకు ఫ్యాన్స్ ఉంటారన్న విషయం తెలిసిందే..అదే విధంగా ఆ హీరో ఫ్యాన్స్ కు వేరే హీరో ఫ్యాన్స్ కు మధ్య అభిప్రాయబేధాలు కూడా ఉంటాయి.. మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప అంటూ తెగ హడావిడి చేస్తారు.. హీరోలను తిడుతూ ఆనందాన్ని పొందుతారు.. అంతవరకు బాగానే ఉంది.. కానీ హీరోల కోసం చనిపోవడం.. లేదా చంపెంతే ఉంటుందా అని చాలా సందేహాలు వస్తాయి.. తాజాగా జరిగిన ఓ ఘటన అవుననే చెబుతుంది..పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది.. అది కాస్త చంపెంత వరకు వెళ్ళింది..


వివరాల్లోకి వెళితే..అత్తిలిలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఏలూరుకు చెందిన హరి కుమార్, కిషోర్ వృత్తిరీత్యా పెయింటర్స్. ఉపాధి కోసం అత్తిలి వెళ్లారు. ఓ వ్యక్తి ఇంటికి పెయింట్ వేసేందుకు హరి కుమార్, కిషోర్ పనికి వెళ్లారు. హరి కుమార్ ప్రభాస్ అభిమాని. ఇక కిషోర్ పవన్ కళ్యాణ్ అభిమాని. హరి కుమార్ తన వాట్సప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియో పెట్టుకున్నాడు. అది కిషోర్ కి నచ్చలేదు. నువ్వు కూడా పవన్ అభిమానిగా మారాలి. పవన్ వీడియో స్టేటస్ లో పెట్టుకోవాలని వాదనకు దిగాడు.

అందుకు హరి కుమార్ నిరాకరించారు. సరదాగా మొదలైన వీరి మాటల యుద్ధం కొట్టుకునే వరకు వెళ్ళింది. ఆవేశంలో హరి కుమార్ పక్కనే ఉన్న కర్రతో కిషోర్ తలపై కొట్టాడు. అలాగే రాయితో ముఖం మీద గట్టిగా మోదాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయాడు..అతడు పరారీలో ఉన్నాడు. ఫ్యాన్ వార్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం దారుణ పరిణామమని పలువురు వాపోతున్నారు. ఇక గతంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.. ఎన్టీఆర్ అభిమానులు ఇలానే చేస్తారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news