బీజేపీలో గ్రూపులు లేవు… పార్టీ గ్రాఫ్ తగ్గలేదు – బండి సంజయ్‌

-

 

బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది దుష్ప్రచారమేనని బండి సంజయ్‌ అన్నారు. జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాక తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుండి ఇక్కడి వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చి స్వాగతం తెలిపినందుకు క్రుతజ్ఝతలు తెలియజేస్తున్నానని తెలిపారు. దారి పొడవునా ట్రాఫిక్ ఏర్పడి ప్రజలకు కొంత ఇబ్బందికి గురయ్యారు. క్షమించాల్సిన వారిని కోరుతున్నానని వివరించారు.

సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశమిచ్చారు. నాపై విశ్వాసముంచి ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా, సైనికుడిలా పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించారు బండి సంజయ్‌. ప్రజల మనసుల్లో బీజేపీ పదిలంగా ఉంది…పేదల పక్షాన మేం చేసిన పోరాటాలు జనం మదిలో నిలిచిపోయామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news