KCRకు ఇవాళ ఏం పీకుడు పనుంది?: బండి సంజయ్

-

ప్రధాని మోడీ మీటింగ్‌ కు సీఎం కేసీఆర్‌ రాకపోవడం పై బండి సంజయ్ సీరియస్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ వస్తే… కప్పెందుకు శాలువా కూడా తీసుకుచ్చానంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ కు ఏమీ పీకుడు పని ఉందని రాలేదని ఆగ్రహించారు. అయన ఈ రోజు షెడ్యూల్ ఏందో బయట పెట్టాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు.

ఇక అటు సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా జరుగుతున్న మీటింగ్ లో మోదీ తెలంగాణ ప్రభుత్వం పై మరియు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము దేశంలో ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఆ రాష్ట్రం మాతో కలిసి వచ్చి మాకు సహకరిస్తే అది మరింత వేగంగా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఏమీ మినహాయింపు కాదు అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రావడం లేదన్నారు. ఆ కారణం గానే మీ రాష్ట్రంలో శంకుస్థాపన చేసిన చాలా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news