కేసీఆర్ ఎవరో కౌన్ కిస్కా…తెలంగాణకు మోడీ సమాధానం చెప్పారు – బండి సంజయ్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరో కౌన్ కిస్కా…తెలంగాణకు మోడీ సమాధానం చెప్పారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కేసిఆర్ కు చెప్పాల్సిన అవసరం మాకు బీజేపీ కి లేదని.. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారని.. మోదీ నీ ఎదురుకోవడానికి ఫ్లెక్సీ ల కోసం పెట్టిన పైసలను పెడ ప్రజల కోసం ఖర్చు పెట్టు అని కేసిఆర్ కు వార్నింగ్‌ ఇచ్చారు బండి సంజయ్‌.

నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని… కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభ తో మరోసారి బహిర్గతం అయిందని తెలిపారు. సీఎం కేసిఆర్ తప్పుడు విధానాల ఫలితమే నిన్నటి సభ అని.. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news